Good News: బ్యాంకులు గ్రాడ్యుయేట్లకు అదిరిపోయే శుభవార్త అందించబోతున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారికి మతిపోయే అవకాశం అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. ఈ అవకాశాన్ని దక్కించుకోవడం ద్వారా వారు ఉపాధిని పొందొచ్చని చెప్పవచ్చు.
Advertisement
అప్రెంటీస్ షిప్ స్కీమ్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 21 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువతకు బ్యాంకులు అప్రెంటీస్షిప్ అవకాశాన్ని అందించబోతున్నాయి. వీరిని బ్యాంకులు అప్రెంటీస్గా నియమించుకుని, శిక్షణతో పాటు నెలకు రూ. 5,000 స్టైపండ్ అందించే అవకాశముంది. ఇది చాలా మందికి ఉపాధి అవకాశాలను తెరవనుంది.
Advertisement
Read also: అక్టోబర్ 5న పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు విడుదల చేయనున్నారు… బెనిఫిషియరీ స్థితి తెలుసుకోండి ఇక్కడ..
ఉద్యోగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా ఈ విషయాన్ని తెలియజేశారు. మార్కెటింగ్, రికవరీస్ వంటి విభాగాల్లో నైపుణ్యం అవసరం లేకపోయినా, శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అప్రెంటీస్ నియామకానికి ప్రాథమిక అర్హతలు
అప్రెంటీస్గా చేరడానికి 21 నుంచి 25 ఏళ్ల వయస్సు మధ్యలో ఉండాలి. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుండి డిగ్రీ పొందిన వారు మాత్రం ఈ కార్యక్రమం కోసం అర్హులు కారు. అలాగే, పన్ను చెల్లింపుదారులు కానివారు మాత్రమే ఈ స్కీమ్లో అప్లై చేయవచ్చు.
- PM Kisan డబ్బులు మీకు రాలేదా? అయితే త్వరగా ఇలా చేయండి
- TS DSC పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఇదే… ఫలితాలు చూసే విధానం
శిక్షణ వివరాలు
ఈ అప్రెంటీస్ షిప్ 12 నెలల కాల పరిమితితో ఉంటుందని, ఆ తర్వాత బ్యాంకులో నియామకం పొందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, బిజినెస్ కరస్పాండెంట్స్గా కూడా వారిని పనిచేయించే అవకాశాలు ఉంటాయని వివరించారు.
ఈ స్కీం ఎప్పుడు అమలు చేస్తారు?
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపిన తర్వాత ఈ స్కీమ్ అమలు ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఐబీఏ పేర్కొంది. ఈ స్కీమ్ చాలా త్వరలో, నెల రోజుల వ్యవధిలోనే అమలులోకి రానుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని చెప్పారు. టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్స్ కల్పించే ప్రణాళికలో భాగంగా ఈ బ్యాంక్ అప్రెంటీస్ స్కీమ్ అమలు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ అప్రెంటీస్ స్కీమ్ ద్వారా యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని, చాలా మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించగలదని ఆశిస్తున్నారు.
Advertisement